40 లీటర్ల సారా పట్టివేత

10 Jun, 2014 23:43 IST|Sakshi
40 లీటర్ల సారా పట్టివేత

అక్రమంగా సారాను బైక్‌పై తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జోగిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. రేగోడ్ మండలం దోసపల్లి తండాకు చెందిన వడ్త్యా రాంజానాయక్ బైక్‌పై 40 లీటర్ల సారాను రాయికోడ్ మండలానికి తరలిస్తున ్నట్లు సమాచారం అందిందన్నారు.

దీంతో మండల పరిధిలోని వట్‌పల్లి గ్రామం వద్ద పట్టుకుని బైక్‌ను సీజ్ చేసినట్లు ఆయన వివరించారు. నిందితుడు రాంజానాయక్ వద్ద నుంచి 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్‌ఐలు లక్ష్మినారాయణ, పట్టాభి చౌదరిలు పాల్గొన్నారని చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు