తెలంగాణలో కొత్తగా 41 కరోనా కేసులు

24 May, 2020 20:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్తగా 41 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1854కు చేరింది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 709 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు మొత్తం 1092 మంది డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం ఒక్కరోజే 24 మంది డిశ్చార్జ్‌ అవ్వగా.. నలుగురు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 53కు చేరింది. ఈ రోజు నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 23, రంగారెడ్డి 1, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లలో 11మందికి, విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో 6 గురికి కరోనా సోకింది.

చదవండి : గొర్రెకుంట గుట్టు వీడింది.. సంచలన నిజం

మరిన్ని వార్తలు