49 పాజిటివ్ స్వైన్ ఫ్లూ కేసులు నమోదు

26 Jan, 2015 17:10 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ తీవ్రత తగ్గుముఖం పట్టిందని నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలిపారు. స్వైన్ ఫ్లూ తీవ్రత తగ్గినప్పటికీ ఇప్పటికీ కొన్ని పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్నారు.

తెలంగాణలో ఇప్పటివరకు 23 మంది స్వైన్ ఫ్లూతో మరణించారని గణాంకాలతో సహా వివరించారు. ప్రజలు ఈ వ్యాధిపై పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు. ఈ వ్యాధిని అరికట్టడం కోసం ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ తీవ్రతకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాలని, వీలైనంత తొందరగా ఈ వ్యాధిని అరికట్టాలని సీఎం కె. చంద్రశేఖర రావు తనను కోరారని తెలియజేశారు. సోమవారం 110 మందికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

మరిన్ని వార్తలు