పిచ్చికుక్కల స్వైరవిహరం

19 Jul, 2015 09:24 IST|Sakshi

రాయికల్ (కరీంనగర్ జిల్లా) : పిచ్చికుక్కల స్వైరవిహరంతో ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామంలో జరిగింది. గత కొంతకాలంగా గ్రామంలో పిచ్చికుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. తాజాగా ఆదివారం గ్రామంలో ఆడుకుంటున్న ఐదుగురు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
 

మరిన్ని వార్తలు