విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత

12 Mar, 2015 11:06 IST|Sakshi
విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత
శంషాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 58 తులాల బంగారాన్ని పట్టుకున్నారు.  గురువారం ఉదయం ఓమన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.  ప్రయాణికులను అధికారులు తనిఖీ చేయడంతో ఓ ప్రయాణికుని నుంచి 584 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు