తల్లి అంత్యక్రియలకు వెళ్తూ..

1 Apr, 2016 14:37 IST|Sakshi

వీణవంక: తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్తున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలాయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాడి రవికిరణ్ అనే వ్యక్తి తల్లి పద్మజ(70) మృతిచెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడానికి కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు పై ఓ వ్యక్తి అడ్డు రావడంతో.. అతన్ని కాపాడే క్రమంలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు