60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

10 Jan, 2016 10:10 IST|Sakshi

బెల్లంపల్లి (ఆదిలాబాద్) : అక్రమంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్న 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. కాజిపేట నుంచి బల్లార్షా వెళ్తున్న రైలులో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, రైల్వే పోలీసులు..  60 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు