మంద నుంచి 60 గొర్రెలు అపహరణ

10 Apr, 2017 12:55 IST|Sakshi

కీసర (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని ఓ కాపరికి చెందిన 60 గొర్రెలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రాంపల్లి గ్రామానికి చెందిన రేగు స్వామి గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. కాగా సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చిరు జల్లులు కురుస్తుండటంతో గొర్రెలను దొడ్డిలో ఉంచి ఇంట్లో నిద్రించాడు. అయితే మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో మంద వద్దకు వెళ్లి పరిశీలించగా 60 గొర్రెలు కనిపించలేదు. గుర్తుతెలియని దుండగులు గొర్రెలను తస్కరించుకెళ్లినట్లు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటి విలువ రూ.4 లక్షలుంటుందని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు