ఇంట్లో గుట్టలు గుట్టలుగా పాములు 

18 Apr, 2020 17:21 IST|Sakshi
గ్రామస్తులు చంపిన పాములు

సాక్షి, కామారెడ్డి : ఒకటి, రెండు కాదు.. ఏకంగా 63 పాములు ఓ ఇంట్లో కనిపించడంతో కలకలం రేగింది. భిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి భూమయ్య శుక్రవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తున్నాడు. అయితే, గోడకున్న రంధ్రం నుంచి ఓ పాము బయటకు రాగా, కుటుంబ సభ్యులు గమనించారు. దీంతో భూమయ్య చుట్టుపక్కల వారిని పిలిచి గోడను తవ్వగా, గుట్టలుగా పాములు కనిపించాయి. మొత్తం 63 పెద్ద పాములను చంపడంతో పాటు వందకు పైగా గుడ్లు కనిపించడంతో వాటిని ధ్వంసం చేశారు.

>
మరిన్ని వార్తలు