జైలు నుంచి 70మంది ఖైదీల విడుదల

29 Mar, 2016 15:23 IST|Sakshi

వరంగల్ జిల్లా : తెలంగాణ వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం వరంగల్ కేంద్ర కారాగారం నుంచి సత్ప్రవర్తన కలిగిన సుమారు 70 మంది ఖైదీలు విడుదల అయ్యారు. ఖైదీల విడుదల విషయం తెలియడంతో ఖైదీల బంధువులు జైళ్ల వద్దకు చేరుకున్నారు. విడుదల పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు