70 కిలోల గంజాయి స్వాధీనం

12 Dec, 2015 13:09 IST|Sakshi

ఖమ్మం జిల్లా అశ్వాపురం పోలీసులు 70 కిలోల గంజాయిని శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఇన్నోవా వాహనంలో గంజాయిని తీసుకెళుతుండగా పట్టుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు సుమారు 70 కిలోల గంజాయి, ఇన్నోవా వాహనం, రూ.2 లక్షల నగదు ను సీజ్ చేశారు.

 

మరిన్ని వార్తలు