70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

18 Jun, 2016 12:03 IST|Sakshi

నల్గొండ : నల్గొండ జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో అక్రమంగా నిల్వ ఉంచిన 70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. బేతవోలు గ్రామంలోని ఓ ఇంట్లో భారీగా రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆగంతకులు సమాచారం అందించారు. దీంతో ఆ శాఖ అధికారులు శనివారం ఉదయం సదరు ఇంటిపై దాడి చేసి... బియ్యాన్ని స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.
 

మరిన్ని వార్తలు