ట్రాక్టర్ బోల్తా: 8 మందికి గాయాలు

14 Apr, 2016 12:22 IST|Sakshi

కమలాపూర్ : కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామ శివారున ఉన్న చెరువులో ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా మట్టిని ట్రాక్టర్‌లో నింపుతుండగా ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు