ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కుబీర్ గ్రామ సమీపంలోని పత్తి మిల్లులో జరిగిన ప్రమాదంలో ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. శనివారం ఉదయం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక బాలికపై ప్రమాదవశాత్తు ఇనుప కడ్డీ పడటంతో తలకు తీవ్ర గాయమైంది. నిర్వాహకులు వెంటనే భైంసా ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు.