మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

17 Feb, 2015 20:35 IST|Sakshi

ఆదిలాబాద్: తాగుడుకు బానిసైన వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని ఎలగడప గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాదలేని చిన్నయ్య(30) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు ప్రారంభించారు. మద్యానికి బానిసైన చిన్నయ్య గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేరనే కారణంతో భార్యను వేధిస్తుండేవాడని అతని తల్లిదండ్రులు చెప్తున్నారు.
 (కడెం)

మరిన్ని వార్తలు