విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి

13 Sep, 2015 14:56 IST|Sakshi

మర్రిగూడ: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ముత్యాలు (50) అనే వ్యక్తి ఇంటి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫారం దగ్గర ముళ్ల చెట్లు పెరిగిపోవడంతో వాటిని తొలగించేందుకు వెళ్లాడు. వైర్లు పక్కనే ఉండడంతో ట్రాన్స్‌ఫారం ఆఫ్ చేసి చెట్లను కొడదామనుకున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫారంను ఆఫ్ చేయబోగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు