వడదెబ్బతో వ్యక్తి మృతి

22 May, 2015 12:51 IST|Sakshi

పిట్లం(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లాలో వడదెబ్బతో శుక్రవారం ఒకరు మృతి చెందారు. పిట్లం మండలం బుర్నాపూర్ గ్రామానికి చెందిన అల్లిగిరి రాములు(65) శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన ఆయన సొమ్మసిల్లి పడిపోయిన వెంటనే ప్రాణాలు విడిచాడు. రాములుకు భార్య పోచవ్వ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని వార్తలు