విద్యను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు

9 Sep, 2015 17:19 IST|Sakshi
  • పీడీఎస్‌యూ రాష్ట్ర  కార్యదర్శి ఆవుల అశోక్
  • మక్తల్(మహబూబ్‌నగర్ జిల్లా) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను విస్మరిస్తున్నాయని, విజ్ఞానాన్ని పెంచి సమాజ అభివృద్దికి విద్య ఉపయోగపడుతుందని, విద్యను విస్మరించడం సరికాదని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఆవుల అశోక్ అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలో సీవీరామన్ డిగ్రీ కళాశాలలో పీడీఎస్‌యూ ఆద్వర్యంలో ఉన్నత విద్య అంశంపై సదస్సు నిర్వహించారు.

    పీడీఎస్‌యూ డివిజన్ అధ్యక్షుడు గోపి నేతృత్వంలో ఈ సదస్సును నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యూనివర్సిటీలు, వైస్ చాన్సలర్లను నియమించ లేదన్నారు. రాష్ట్రంలోని 17యూనివర్సిటీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు