ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ అధికారి

28 Apr, 2015 19:29 IST|Sakshi

కరీంనగర్ : లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమీషనర్ శివనాయక్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వలపన్ని మంగళవారం నాయక్‌ను పట్టుకున్నారు.

 

ఒక పని నిమిత్తం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం ఏసీబీ అధికారులు...  బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా నాయక్‌ను పట్టుకున్నారు. అవినీతి అధికారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు