లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్

20 Feb, 2015 21:52 IST|Sakshi

మెదక్: కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా జోగిపేటలోని మహిళా పాల్‌టెక్నిక్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం జరిగింది. కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివశంకర్ అటెండర్ శ్రీకాంత్ నుంచి రెండువేలు లంచంతీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు.
(జోగిపేట)

>
మరిన్ని వార్తలు