ఏసీబీకి చిక్కిన వీఆర్వో

30 Jun, 2015 14:36 IST|Sakshi

సిరికొండ (నిజామాబాద్ జిల్లా) : రూ.5వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో శ్రీనివాస్ ఏసీబీకి చిక్కాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కొలు గ్రామంలో ఆయన వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా గ్రామానికి చెందిన మైమూద్ అనే రైతు తన తండ్రి పేర ఉన్న భూమిని తన పేరు మీద మార్చాలని వీఆర్వోను సంప్రదించాడు.

దీంతో వీఆర్వో రూ.15వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా చివరికి రూ.5వేలకు ఒప్పుకున్నట్లు సమాచారం. వెంటనే బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం మైమూద్ నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వో శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు