పెగడపల్లి (కరీంనగర్) : పట్టా పుస్తకాలలో పేరు మార్చడం కోసం రూ. 6 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి వీఆర్వోగా పనిచేస్తున్న శ్రీనివాసులు గత కొద్దిరోజులుగా నందగిరి గ్రామానికి వీఆర్వో లేకపోవడంతో.. అదనంగా బాధ్యతలు చూసుకుంటున్నారు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన మహిపాల్ అనే రైతు నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటూ సోమవారం రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అదనపు సమాచారం కోసం అతన్ని ఏసీబీ డీఎస్పీ సురేందర్గౌడ్ విచారణ చేపడుతున్నారు.