ఐసీడీఎస్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

1 Apr, 2015 15:04 IST|Sakshi

మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని ఐసీడీఎస్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఐసీడీఎస్ కార్యాలయానికి సంబంధించి విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడంతో బుధవారం ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు చేశారు.

ఈ దాడుల్లో భాగంగా కంప్యూటర్ ఆపరేటర్ వద్ద ఉన్న రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐసీడీఎస్ సీపీడీవోపై విచారణ నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్‌పీ సుదర్శన్ చెప్పారు.

మరిన్ని వార్తలు