'షాదీ ముబారక్'లో అక్రమాలపై ఏసీబీ విచారణ

27 Mar, 2016 18:15 IST|Sakshi

నార్నూరు: ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో షాదీ ముబారక్ పథకంలో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆదివారం విచారణ నిర్వహించారు. 2003 నుంచి 2008 మధ్య వివాహం చేసుకున్న వారు కూడా ఇటీవల షాదీ ముబారక్ పథకం కింద లబ్ది పొందిన విషయాన్ని సాక్షి పత్రిక కథనాలను ప్రచురించింది. దీంతో ముగ్గురు ఏసీబీ అధికారులు నార్నూరు ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ ఎమ్మార్వో సోము సమక్షంలో రికార్డులను తనిఖీ చేపట్టారు. 11 మందికిగాను ఇద్దరు లబ్దిదారులను గుర్తించారు. అనంతరం రెండు రోజుల తర్వాత మరోసారి తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు