-

డీసీఎం ఢీకొని వృద్ధురాలి మృతి

12 Oct, 2015 23:18 IST|Sakshi

మహబూబ్ నగర్: అడ్డాకుల మండలం జానం పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం ఢీకొని వృద్ధురాలి మృతి చెందింది. దీంతో హైవేపై గ్రామస్తులు నిరసన, ధర్నాకు దిగారు. ఫలితంగా రోడ్డుపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు జోక్యం చేసుకున్నా వారు వెనుకకు తగ్గకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు. వనపర్తి డీఎస్పీ చెన్నయ్య తలకు గాయం అయ్యింది.

మరిన్ని వార్తలు