పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పై ప్రమాదం

8 Dec, 2017 15:57 IST|Sakshi

రంగారెడ్డి : రాజేంద్ర నగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 245వ నెంబర్‌ పిల్లర్‌ వద్ద పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే పైన ప్రమాదం జరిగింది. జ్యోతి నగర్ నుంచి  శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన వంశీ అనే ఉద్యోగికి గాయాలు అయ్యాయి. వెంటనే పెట్రోలింగ్‌ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని బాధితుడిని బయటికి తీశారు. అనంతరం ఆ మార్గంలో ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

మరిన్ని వార్తలు