ఈత కొలనుల వద్ద ప్రమాద హెచ్చరికలు

30 Mar, 2018 13:23 IST|Sakshi
పెద్దవాగు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన పోలీసులు

పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీల ఏర్పాటు

ఆసిఫాబాద్‌ : వేసవి సెలవుల్లో ఉపశమనం కోసం ఈతకు వెళ్లిన విద్యార్థులు, ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా సీఐ బాలాజీ వరప్రసాద్‌  ఆధ్వర్యంలో పోలీసులు  మండలంలోని వాగులు, ఒర్రెల వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వేసవిలో సరదా కోసం ఈత కొలనుల వద్దకు వెళ్లి పిల్లలు మృత్యు వాత పడుతున్నారని, ముందు జాగ్రత్తగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈతకు వెళ్లడం నిషేదమన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో ఎస్సై ఖమ్రొద్దీన్, పోలీసులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు