మళ్లీ అమ్మాయిలదే పైచేయి

27 Apr, 2015 10:21 IST|Sakshi

అమ్మాయిలు మళ్లీ అదరగొట్టారు! సోమవారం ఉదయం విడుదైన ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో విద్యార్థినుల ఉత్తీర్ణత శాతం 66.86 గా నమోదయింది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మాత్రం 55.91 వద్దే ఆగిపోయింది. అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలు 5.23శాతం మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం పాస్ పర్సంటేజీ 61.14గా నమోదయినట్లు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అబ్బాయిలకన్నా అమ్మాయిలు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఆనందంగా ఉన్నారని, అందుకు తానుకూడా సంతోషిస్తున్నానని మంత్రి అన్నారు. గతవారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లోనూ అమ్మాయిలదే పైచేయి కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు