'సహ'దరఖాస్తు చించినందుకు ఆందోళన

12 Feb, 2015 15:51 IST|Sakshi


కరీంనగర్: అడంగల్, పహణీల పరిశీలన కోసం సమాచార హక్కు చట్టం కింద పెట్టుకున్న దరాఖాస్తును చించివేసిన అధికారులపై చర్య తీసుకోవాలని కె. మహేందర్ అనే వ్యక్తి తహసీల్ధార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధ్యులైన అధికారులపై చర్యతీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.

(కమలాపూర్)

>
మరిన్ని వార్తలు