తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ఫ్లూ విజృంభణ ఇంకా తగ్గలేదు. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలోని కొంతమంది ఎయిర్ఫోర్స్ సిబ్బందికి కూడా ఈ వ్యాధి సోకింది. ఆదివారం ఒక్కరోజే 52 కొత్త స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు.
దీంతో ఇప్పటివరకు ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే 25కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 390 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నియంత్రణ గురించి పట్టించుకోలేదనే వైద్యారోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య పదవి కూడా ఊడిపోయిన సంగతి తెలిసిందే.