విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టివేత

2 Jun, 2014 00:32 IST|Sakshi

శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన కెన్యా దేశానికి చెందిన రజీయా లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో 1,300 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.

అంతకుముందు ఉదయం దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద ఎలాంటి రశీదులు లేకుండా తీసుకొచ్చిన 150 గ్రాముల బంగారాన్ని కూడా  అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు