సాక్షి, హైదరాబాద్: ఆరేళ్లుగా ప్రభుత్వా స్పత్రులకు నిధులు కేటాయించకపోవడం వల్లే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ప్రజలు బలవుతున్నారని యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణీ రుద్రమ అన్నారు. ఆదివారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. శాశ్వత ప్రాతిపదికన వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాలు చేపట్టి ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.