అమాత్య అల్లోల ...

17 Dec, 2014 08:43 IST|Sakshi

ఆదిలాబాద్ :రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపుల్లో భాగంగా ఆయనకు న్యాయ, గృహ నిర్మాణ శాఖలు దక్కాయి. దీంతో ఆయన అనుచరవర్గంలో హర్షం వ్యక్తమైంది. నిర్మల్, సిర్పూ ర్ నియోజకవర్గాలతోపాటు, పలుచోట్ల టీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందోత్సహాల్లో మునిగితేలాయి. ఐకే రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో కొనసాగారు.
 
 ఆయన వృత్తికి తగినట్లు గానే ఆయనకు న్యాయశాఖ దక్కింది. అలాగే గృహ నిర్మాణ శాఖ కూడా కేటాయించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న జోగు రామన్నకు బాధ్యతలు పెరిగాయి. అదనంగా బీసీ సంక్షేమ శాఖను ఆయనకు కేటాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాధాన్యం మరింత దక్కిం ది. రామన్నకు బీసీ సంక్షేమశాఖ కేటాయించడం పట్ల జిల్లాలోని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.
 
 రేఖానాయక్ వర్గీయుల్లో ఆసంతృప్తి..
 మంత్రివర్గ కూర్పులో జిల్లాలోని మహిళా ఎమ్మెల్యేలకు చుక్కెదురు కావడంతో అంతర్గతంగా అసంతృప్తులు రగులుతున్నాయి. మహిళా కోటాలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితోపాటు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్ ఈ పదవులు ఆశించారు. కోవ లక్ష్మికి పార్లమెంటరీ సెక్రటరీ పదవి దక్కగా, రేఖ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోవ లక్ష్మికి పార్లమెంటరీ సెక్రటరీ పదవి దక్కడంపై ఆమె వైఖరి ఎలా ఉన్నా, ఆదివాసీ సంఘాలు మాత్రం భగ్గుమంటున్నాయి. ఆదివాసీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ నేతలు ఇంద్రవెల్లిలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తానని జోడేఘాట్‌కు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ఆదివాసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
 
 నలుగురికి కేబినెట్ హోదా..
 ఉమ్మడి రాష్ట్రంలో పదవుల కేటాయింపుల్లో జిల్లాకు అన్యాయం జరుగ గా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఇక్కడి నేతలకు ముఖ్యమైన పదవులు వరిస్తున్నాయి. 1984 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ జెడ్పీ చైర్మన్‌గా, ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డికి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి కలగానే మిగిలింది. ఇప్పుడు మంత్రి పదవి దక్కడంతో ఆయన చిరకాల వాంఛ నెరవేరినట్లయ్యింది.
 
 ఇంద్రకరణ్‌రెడ్డితో కేబినెట్ హోదా కలిగిన నేతల సంఖ్య జిల్లాలో నాలుగుకు చేరింది. మంత్రి జోగు రామన్న ఇప్పటికే కేబినెట్ మంత్రిగా కొనసాగుతుండగా, ప్రభుత్వ విప్‌గా నియమితులైన చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కూడా కే బినెట్ హోదా ఉంది. పార్లమెంటరీ సెక్రటరీ కోవ లక్ష్మి మాత్రం సహా య మంత్రి హోదాలో కొనసాగనున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిని ధిగా ఉన్న వేణుగోపాలచారి కూడా కేబినేట్ హోదాలోనే ఉన్నారు.

మరిన్ని వార్తలు