సొంత ఇల్లు ఉన్నా టెంటు నీడన..

20 Aug, 2014 01:11 IST|Sakshi
సొంత ఇల్లు ఉన్నా టెంటు నీడన..

నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సంగని సాయిబాబా ఉపాధి కోసం కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాకు కుటుంబం సహా వెళ్లారు. ఇక్కడ ఉన్న ఆయన నివాస గృహాన్ని ఇతరులకు అద్దెకు ఇచ్చారు. సర్వే కోసం సోమవారం స్వగ్రామానికి వచ్చారు.

అద్దెకు ఉన్నవారు ఇంటికి తాళం వేసుకుని తమ ప్రాంతానికి సర్వే కోసం వెళ్లిపోయారు. దీంతో సాయిబాబా ఇంటి ఎదుట ఒక టెంటును ఏర్పాటు చేసుకుని రెండు రోజుల పాటు కుటుంబసభ్యులతో గడిపి సర్వేలో వివరాలను నమోదు చేయించుకున్నారు.
 

మరిన్ని వార్తలు