రోడ్డుప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

3 Feb, 2016 13:27 IST|Sakshi

జైనత్ మండలం మాకోడా గ్రామం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదు.

 

మరిన్ని వార్తలు