అండమాన్ ఎక్స్‌ప్రెస్ ఐదు గంటలు ఆలస్యం

30 Mar, 2015 19:58 IST|Sakshi

రామగుండం (కరీంనగర్ జిల్లా): జమ్ముకాశ్మీర్‌లో కుండపోత వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం జమ్ముతావి నుంచి చెన్నై వెళ్లే అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ రైలు కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 4.30 గంటలకు రావాల్సి ఉండగా, ఐదు గంటల ఆలస్యంగా రాత్రి 10 గంటలకు వచ్చింది. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు