'అంగన్వాడీలను ప్రాథమిక స్కూళ్లలో కలపాలి'

18 May, 2015 15:57 IST|Sakshi

హైదరాబాద్:  ప్రొ. హరగోపాల్ నేతృత్వంలో విద్యా పరిరక్షణ కమిటీ సోమవారం తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసింది. ఈ సందర్భంగా రేషనలైజేషన్ విషయమై కడియంతో విద్యా పరిరక్షణ కమిటీ చర్చించింది. రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లు మూసివేయడం సరికాదని పేర్కొంది. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆపాలని డిమాండ్ చేసింది.

అంగన్వాడీలను ప్రాథమిక స్కూళ్లలో కలపాలని ప్రొ. హరగోపాల్ కోరారు. రేషనలైజేషన్కు వ్యతిరేకంగా ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేయనున్నట్టు ప్రొ. హరగోపాల్ చెప్పారు.

మరిన్ని వార్తలు