రిలీఫ్‌..

13 May, 2020 10:18 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసినకొత్వాల్‌

సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు శుభవార్త. మార్చి 22 నుంచి రోడ్ల పైనే డ్యూటీకి అంకితమైన వీరికి రొటేషన్‌ పద్ధతిలో ఒక రోజు చొప్పున ఆఫ్‌(విశ్రాంతి దినం) ఇవ్వాలని కొత్వాల్‌ అంజనీకుమార్‌ నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా (ఎస్‌హెచ్‌ఓ) వ్యవహరించే ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. ఈ విషయాన్ని కొత్వాల్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. రొటేషన్‌ పద్ధతితో ప్రతి ఒక్క కానిస్టేబుల్‌కు ఆఫ్‌ వచ్చేలా చూడాలని ఆయన కోరారు. 
 

మరిన్ని వార్తలు