కాళేశ్వరానికి మరో కీలక అనుమతి

6 Jun, 2018 17:20 IST|Sakshi
కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతం

ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) నుంచి కీలక అనుమతులు లభించాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో అనుమతులు జారీ చేస్తున్నట్లు టీఏసీ తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర​, భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌ రావులు అనుమతులు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనుమతులు మంజూరు చేసినందుకు గానూ కేంద్ర జల వనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు