నిశ్శబ్ద జోన్ల ప్రచారానికి డీజీపీ శ్రీకారం

21 Aug, 2016 02:10 IST|Sakshi
నిశ్శబ్ద జోన్ల ప్రచారానికి డీజీపీ శ్రీకారం

హైదరాబాద్‌: పాఠశాలలు, ఆస్పత్రులు, కార్యాలయాల పరిసరాల్లో నిశ్శబ్ద జోన్ల ప్రచారానికి  డీజీపీ అనురాగ్‌శర్మ శ్రీకారం చుట్టారు. హార్న్‌ నాట్‌ ఒకే జోన్‌ అనే  స్వచ్ఛంద సంస్థ పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిశ్శబ్ద జోన్ల పరిధిలో స్కూళ్లు, ఆస్పత్రులతో పాటు డీజీపీ కార్యాలయాన్ని చేర్చడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శాంతిభద్రతల డీఐజీ కల్పనా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు