దంతాలపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినయోగించుకోవడానికి తెలంగాణలో ఉపాధికి వచ్చిన ఆంధ్ర ఓటర్లు బుధవారం తరలివెళ్లారు. నర్సింహులపేట మండల కేంద్రానికి సుమారు పది సంవత్సరాల క్రితం ఉపాధి కోసం వచ్చిన ఒంగోలువాసులు మేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు వెళ్తుండగా సాక్షి వారిని పలకరించగా తమది ఒంగోలు జిల్లా కనిగిరి అని ఎన్నికల్లో ఓటు వేయడం బాధ్యతగా భావించి వెళ్తున్నామని తెలిపారు.