‘శుభప్రదం’కు దరఖాస్తుల ఆహ్వానం

15 May, 2018 10:35 IST|Sakshi
ఉషానందిని

హిమాయత్‌నగర్‌: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్‌ సంయుక్తాధ్వర్యంలో 7, 8, 9వ తరగతుల విద్యార్థులకు శుభప్రదం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఏఈఓ బండి ఉషానందిని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దీనికి సంబంధించిన దరఖాస్తులు హిమాయత్‌నగర్‌లోని టీటీడీ కార్యాలయంలోలేదా www.tirumala.org వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను పొందవచ్చన్నారు. ఈ నెల 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఉషానందిని తెలిపారు.

>
మరిన్ని వార్తలు