ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య

30 Apr, 2015 17:51 IST|Sakshi

హైదరాబాద్ సిటీ: లంగర్‌హౌజ్ పరిధిలోని కనకదుర్గకాలనీలో సత్యనారాయణ(73) అనే మిలటరీ రిటైర్డ్  ఉద్యోగి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకున్నాడు. ఆరోగ్యం సరిగా లేనందునే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు