హైదరాబాద్ : థర్మాకోల్తో రూపుదిద్దుకున్న వివిధ ఆకృతులు కళాభిమానులను కట్టిపడేస్తున్నాయి. ప్రముఖ థర్మాకోల్ కళాకారుడు ఎండి.సయీద్ వీటిని తీర్చిదిద్దారు. ఇవి ఇప్పటికే దేశ విదేశాల కళాభిమానులను రంజింపజేశాయి. చార్మినార్, ఇసుర్రాయి, గిర్నీ, చార్మినార్, కమాండో నైఫ్, గిటార్, మైక్రోస్కోప్, టెలిస్కోప్ తదితర ఆకృతులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటివరకు సుమారు 85 కళాకృతులను థర్మాకోల్తో తీర్చిదిద్దినట్లు సయీద్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులెదుర్కొంటున్న నేపథ్యంలో వీటి ప్రదర్శన తనకు భారంగా మారిందన్నారు. తెలంగాణ ప్రభు త్వం తనను ఆదుకోవాలని ఆయన కోరారు.