ఆశా కార్యకర్త ఆత్మహత్య

23 Feb, 2016 13:58 IST|Sakshi

కుటుంబకలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం వేంపల్లి గ్రామానికి చెందిన రామిళ్ల స్వప్న(35) ఆశా కార్యకర్తగా పనిచేస్తోంది. ఇటీవల భర్తతో ఆమెకు విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆమె మంగళవారం ఉదయం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ మేరకు పోలీసులు.. భర్త మోహన్ సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

 

మరిన్ని వార్తలు