ఆర్డీవో కార్యాలయం ముట్టడి

3 Nov, 2015 12:31 IST|Sakshi

భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణ ఆర్డీవో కార్యాలయాన్ని మంగళవారం ఆశావర్కర్లు ముట్టడించారు. జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు చేస్తున్న నిరసనలకు సీఐటీయూ నాయకులు తమ సంఘీభావం తెలిపిన నేపథ్యంలో ఈ రోజు ఆశావర్కర్లు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులకు ఆశావర్కర్లకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు గంటలకు పైగా ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు సీఐటీయూ కార్యకర్తలతో పాటు, ఆశావర్కర్లను అరెస్ట్ చేశారు.
 

మరిన్ని వార్తలు