వరంగల్ క్రైం : నాడు రూరల్ ఎస్పీగా పనిచేసిన కాళిదా సు.. నేడు ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి జాతరలో చేసిన ‘షో’ అట్టర్ ఫ్లాపయింది. నాడు కాళిదాసు అన్నీ తానేనంటూ అర్థం లేని ఆలోచనలతో జాతర నిర్వహణలో విఫలమయ్యారు. నేడు ఏఎస్పీ కారణంగా శాఖ మొత్తం అభాసుపాలయ్యే దుస్థితి ఉంది.
ఒంటెద్దు పోకడలతో ఇబ్బందులు..
గత జాతర సందర్భంగా అప్పటి రూరల్ ఎస్పీ కాళిదాసు అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేయడం, వన్వే ఏర్పాటు చేయడంలో విఫలమయ్యా రు. ఫలితంగా రెండు, మూడు రోజులపాటు ట్రాఫిక్ జా మ్ అయింది. ఇలా పలు కారణాలతో గత జాతర సందర్భంగా పోలీసులు చెడ్డపేరు మూటగట్టుకున్నారు. ఇలాం టి ఘటనలు తలెత్తకుండా ఈసారి రూరల్ ఎస్పీ అంబర్ కి షోర్ఝా ప్రణాళిక సిద్ధం చేశారు. అది సత్ఫలితాలిస్తు న్న తరుణంలో ఏఎస్పీ విశ్వజిత్ మచ్చ తెచ్చేలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.