రక్తదానం చేసిన ‘అసుర’ మూవీ టీం

16 May, 2015 21:03 IST|Sakshi

హైదరాబాద్: రెటినోబ్లాస్టోమా అవగాహన వారోత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు సహకారంతో బ్లడ్ లైవ్ అనే కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని శనివారం సినీనటుడు నారా రోహిత్ ప్రారంభించారు. రక్తదానం చేయడానికి ముందుకురావడం సమాజ సేవ అని ఆయన అభివర్ణించారు.

ఇలాంటి ఉత్తమ కార్యక్రమాలు, సమాజ సేవ నిర్వహిస్తున్న రెండు ప్రముఖ సంస్థలతో అనుబంధం ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అసుర సినిమా సిబ్బంది రక్తదానం చేశారు. కంటి క్యాన్సర్‌తో బాధపడుతున్న 5 ఏళ్ల లోపు పిల్లలకు సహాయం అందించేందుకు వీరంతా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు