నారాయణఖేడ్‌లో ఏటీఎం మెషిన్ ధ్వంసం

18 Apr, 2016 09:23 IST|Sakshi

నారాయణ్‌ఖేడ్‌లోని బసవేశ్వరం చౌక్ వద్ద సోమవారం తెల్లవారుజామున నెంబర్ వన్ ఏటీఎం మెషిన్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దుండగులు ఏటీఎం మెషిన్‌ను గడ్డపార, పలుగుతో పెకలించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎంత మొత్తంలో నగదు చోరీ జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు