పెట్రోల్‌ బంకులపై కొరడా 

14 Jul, 2018 02:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్‌ బంకులపై తూనికలు కొలతల శాఖ కొరడా ఝుళిపించింది. పెట్రోల్‌ బంకుల మోసాలపై కొద్దీకాలంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. దాదాపు 70 బంకుల్లో తనిఖీలు చేయగా..నిబంధనలు ఉల్లంఘించిన 15 బంకులపై కేసులు నమోదు చేశారు. ఇందులో 12 బంకుల్లో డీజిల్‌ తక్కువగా పోస్తుండటం తోనూ , లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోని మరో 3 బంకులపై కేసులు నమోదు చేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఉప్పల్‌ దగ్గర ఉన్న ఐడీపీఎల్‌ ఫార్చ్యూన్‌ ఫ్యుయల్‌ హెచ్‌పీసీ పెట్రోల్‌ బంకులో అసిస్టెంట్‌ కంట్రోలర్‌ జగన్మోహన్‌ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఇందులో 5 లీటర్ల డీజిల్‌కు 300 ఎంఎల్‌ తక్కువగా పోస్తున్నారని గుర్తించి కేసు నమోదు చేశారు. పెట్రోల్‌ బంకుల్లో మోసాలకు పాల్పడితే  కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు